మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెనీకి చెందిన ఆస్తుల వేలం వేస్తామని ప్రకటించింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్ల రుణం కూడా తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్కు రూ.452.41 కోట్ల బకాయి పడటంతో వేలం వేస్తున్నట్టు ప్రకటించారు.
రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్ర్ ట్రాయ్ కంపెనీ.. కన్ స్ట్రక్షన్ సంస్థ. సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంక్ నుంచి రుణం తీసుకొని చెల్లించలేదు. లోన్ తీసుకునేముందు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వచ్చే నెల 18వ తేదీన వేలం వేస్తామని.. వేలంలో పాల్గొనేవారు 14వ తేదీ లోపు బిడ్ దాఖలు చేయాలని గడువు విధించింది.

రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ కూడా కొద్దిరోజుల క్రితం పత్రికా ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు నుంచి ట్రాన్స్ట్రాయ్ ఇండియా, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరుతో రుణం తీసుకున్నారు.
Recommended Video
లోన్కు గ్యారెంటీగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ లేదంటే టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ను సంప్రదించాలని బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications