అందుకే దుగరాజుపట్నం పోర్ట్ సాధ్యం కాదు, కానీ: చంద్రబాబు కోర్టులోకి కేంద్రం
న్యూఢిల్లీ: ఏపీలోని దుగరాజుపట్నం వద్ద పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తేల్చి చెప్పింది. ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, రవీంద్ర కుమార్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావులు పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
దుగరాజుపట్నం పోర్ట్ సాధ్యపడదని నీతి అయోగ్ చెప్పిందని, దాని సమీపంలో కృష్ణపట్నం, చెన్నై తదితర పోర్టులు ఉన్నాయని తెలిపింది. దుగరాజుపట్నం వద్ద పోర్టుకు బదులు మరోచోట ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. అందుకు తగినస్థలం చూపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఎక్కడ చూపుతుందోనని వేచి చూస్తున్నామని కేంద్రం తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి ఖర్చు, ఆడిట్, ప్రతిపాదనల వివరాలు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలపై కేంద్రం స్పందిస్తూ... ప్రస్తుతం కేసు కృష్ణా ట్రైబ్యునల్లో కొనసాగుతోందని తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేస్తుందన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications