ఎపిలో వివిధ పధకాల కోసం రూ.75 కోట్లు విడుదల చేసిన కేంద్రం...
అమరావతి: ఎపికి కేంద్రం నుంచి కొత్త నిధులు వచ్చాయి. వివిధ పధకాల క్రింద ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. కేంద్ర పర్యాటక శాఖ ఈ నిధులను విడుదల చెయ్యడం గమనార్హం.
కేంద్ర పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన 'ప్రసాద్' పథకం క్రింద అమరావతి ప్రాంతానికి పర్యాటక జిల్లాగా అభివృద్ది చేసేందుకు 8.5 కోట్ల రూపాయలు, స్వదేశీ దర్శన్ కింద నెల్లూరు జిల్లాకు 14.35 కోట్ల రూపాయలు, కాకినాడ ఐలాండ్ డెవలప్ మెంట్ కోసం 7.31 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయత్ సశక్తి కరణ్ అభియాన్ పధకం కొరకు మరో 45.37 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.

భారతదేశంలో మతపరమైన మరియు ఆధ్యాత్మిక క్షేత్రంను పెంపొందించుటయే ఈ పథకం యొక్క లక్ష్యం. మిషన్ వ్యూహంలో భాగంగా, ప్రపంచ స్థాయి పర్యాటక ఉత్పత్తులుగా గుర్తింపు గల సామర్ధ్యం కలిగిన మత గమ్యస్థానాలను గుర్తించడం మరియు అవస్థాపన ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి వంటివి ఉంటుంది.
ఈ పథకంలో భాగంగా, దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం థీమ్ ఆధారిత పర్యాటక సర్క్యూట్లను గుర్తించారు. ఈ థీమ్ ఆధారిత పర్యాటక సర్క్యూట్ (టిబిటిసి) అనేది మతం, సంస్కృతి, జాతి, సముచిత, మొదలైన వాటి ప్రత్యేక నేపథ్యాల చుట్టూ ఉన్న ఒక పర్యాటక సర్క్యూట్ గా నిర్వచించవచ్చు.












Click it and Unblock the Notifications