రాజ్నాథ్, సుష్మాలను కలిసిన విద్యాసాగర్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం ఇక్కడ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైన నేపథ్యంలో విద్యాసాగర్ రావు.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను కలిశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు గోవా గవర్నర్గా మృధుల సిన్హా, కర్ణాటక గవర్నర్గా విఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్గా కళ్యాణ్ సింగ్లు నియమితులయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్గా నియమితులైన సిహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేంద్ర సహాయమంత్రిగా కూడా ఆయన పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన గెలుపొందారు.

విద్యాసాగర్ రావు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం ఇక్కడ పలువురు కేంద్రమంత్రులను కలిశారు.

విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైన నేపథ్యంలో విద్యాసాగర్ రావు.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను కలిశారు.

విద్యాసాగర్ రావు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్గా నియమితులైన సిహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేంద్ర సహాయమంత్రిగా కూడా ఆయన పని చేశారు.












Click it and Unblock the Notifications