భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు
అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

భువనేశ్వరితో కలిసి చంద్రబాబు..
చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి కూడా రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం రాజధాని ప్రాంత రైతులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. అంతేగాక, నారా భువనేశ్వరి తన గాజులను రాజధాని రైతులకు విరాళంగా ఇచ్చారు. రాజధాని రైతులకు మద్దతు పలికిన చంద్రబాబు.. ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు.

భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదంటూ..
ఈ నేపథ్యంలో సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఆమె భర్త అన్యాయంగా తీసుకున్న భూములని అన్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరులో భూములు కొట్టేసింది మీ భర్త కాదా అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర, సీమకు వ్యతిరేకమా?
హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని అన్నారు. టీడీపీ నేతల 4వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అంతేగాక, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. చంద్రబాబు, భువనేశ్వరి ఈ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు..
చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి బుధవారం రాజధాని రైతులను కలిశారు. రాజధాని కోసం వారు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. నమ్మొద్దు అని ఎంత చెప్పినా వినకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రజలు, రైతులతో వ్యాఖ్యానించారు. ఏదైమైనా తాను రాజధాని రైతులకు అండగా ఉంటానని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. అమరావతి రాజధానిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా స్వాగతించారని చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications