అగ్రిగోల్డ్ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి... పూర్తి నగదు చెల్లించాలి : చంద్రబాబు డిమాండ్
అగ్రిగోల్డ్ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని... వారికి పూర్తి నగదు చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదన్నారు. దశలవారీ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఆ మాట తప్పారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపుపై ఈ నెల 28న టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ ముఖ్య నేతలతో సోమవారం(ఆగస్టు 23) జరిగిన భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రూ.413 కోట్లు డిపాజిట్ చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని... కానీ ఇప్పటికీ కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు అందలేదని అన్నారు. కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా.. వాటిని ఇవ్వకుండా దారి మల్లించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యాచారాలు,హత్యలకు సంబంధించి అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని... దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థకు అనుమతులు వచ్చాయని... ఆయన హయాంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసిందని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే దోచుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు తీవ్ర మనోవేదనకు గురిచేశారని... 300 మంది బాధితుల ఆత్మహత్యలకు కారకుడయ్యారని విమర్శించారు. పాదయాత్ర సమయంలోనే జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించామని... ఈ నెల 24న రూ.20వేల లోపు బాధితులకు చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా ఇదే అభిప్రాయపడ్డారు.300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.
ఏపీలో అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అగ్రి గోల్డ్ సంస్థలో రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు ఈనెల 24న ప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించనుంది. అయితే పూర్తి సొమ్మును చెల్లిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ నెల 19 వరకూ 7.76లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.అగ్రి గోల్డ్ సంస్థలో రూ.10వేల లోపు డిపాజిట్ చేసినవారికి గతంలోనే ప్రభుత్వం రూ.240 కోట్లు విడుదల చేసి ఆ సొమ్మును చెల్లించింది.
-
Botsa Satyanarayana: బొత్సకు మళ్లీ అస్వస్ధత-మండలిలో మాట్లాడుతూనే..! -
ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications