నోరు జారిన పల్లె, చంద్రబాబు ఆగ్రహం: ఆ పదవీ పోగొట్టుకున్నారు
మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి నోరు జారి తనకు వచ్చే చీఫ్ విప్ పదవిని పోగొట్టుకున్నారంటున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఉద్వాసన పలికిన సీఎం చంద్రబాబు.
అమరావతి: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి నోరు జారి తనకు వచ్చే చీఫ్ విప్ పదవిని పోగొట్టుకున్నారంటున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఉద్వాసన పలికిన సీఎం చంద్రబాబు.. అనంత జిల్లాకే చెందిన కాల్వ శ్రీనివాసులును కేబినెట్లోకి తీసుకున్నారు.
పల్లె రఘునాథ్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించిన చంద్రబాబు, చీఫ్ విప్ పదవి ఇస్తానని చెప్పారని, కానీ ఆయన నోరు జారి దానిని కూడా పోగొట్టుకున్నారని మంగళవారం శాసన సభ లాబీల్లో గుసగుసలాడుకుంటున్నారు.
జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు
విస్తరణకు ముందు..
మంత్రివర్గ విస్తరణకు ముందు కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్గా ఉన్నారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గాన్ని ఎస్టీలలో చేరుస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాల్సి ఉంది.
కాల్వకు మంత్రి పదవి ఇచ్చేందుకు..
ఈ నేపథ్యంలో బోయ సామాజిక వర్గానికి చెందిన కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ విషయాన్ని చంద్రబాబు.. పల్లెకు తెలిపారు.
ముందే చెప్పిన బాబు
నిన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని లేదని, పరిస్థితులు అలా ఉన్నాయని, మీ స్థానంలో కాల్వకు మంత్రి పదవి ఇస్తానని, మీకు చీఫ్ విప్ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనతో చెప్పారు. దానికి పల్లె కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
అలా చేయడంతో..
అయితే, పల్లె ఈ విషయాన్ని వెంటనే మీడియాకు ప్రకటన ఇప్పించుకున్నారని, చీఫ్ విప్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేయించుకున్నారని, ఈ విషయం తెలిసి చంద్రబాబు వెనక్కి తగ్గారంటున్నారు. ఈ వి