ఆ కేంద్ర పథకంపై చంద్రబాబు కీలక నిర్ణయం..! ఇక రాష్ట్రంలో..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. అదే సమయంలో కేంద్రంలోనూ టీడీపీ-బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులతో తీసుకొచ్చిన ఓ పథకానికి రాష్ట్రంలోనూ విస్తృతంగా ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు ఇవాళ జరిగిన కూటమి పార్టీ నేతల భేటీలో నిర్ణయించారు.
పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా కేంద్రం తెచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి కొత్తా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన మంత్రి కందుల దుర్గేష్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో జీ రామ్ జీ పథకం అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి, పేదలకు ఎలాంటి మేలు జరుగుతుందన్న అంశంపై చర్చించారు.

గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం కంటే ఇప్పుడు కేంద్రం తెచ్చిన జీ-రామ్-జీ పథకంలో అదనంగా ఇంకొన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఉందని, సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాట్లను ఈ స్కీం పరిధిలోకి తెచ్చారని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరతాయన్నారు. రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు వాటి అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలుగుతామన్నారు.

ఈ స్కీంలో భాగంగా గ్రామాల్లో గోకులాలు నిర్మించుకోవచ్చని, ప్లాంటేషన్ చేసుకోవచ్చని, పశు గ్రాసం పండించుకుని ఉపాధి కల్పించవచ్చని, తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార వంటి పథకాలను అనుసంధానం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు నిర్మించుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం ద్వారా ఆస్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అలాగే ఏయే రోజుల్లో పనులు చేపట్టాలనే విషయం మీద కూడా గ్రామ సభల్లో చర్చించి గ్రామస్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేయాలన్నారు. అలాగే జీ రామ్ జీ స్కీం కింద ఎలాంటి పనులు చేపడుతున్నామనే విషయాన్ని ఆన్ లైన్లో పొందుపరుస్తే వికసిత భారత్, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. దీనిపై ఓ పక్క మూడు పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చ చేపడతామన్నారు.
-
పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!! -
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! -
చంద్రబాబు ముగ్గురు బిడ్డల పథకంపై మాజీ ఫ్రెండ్ పంచ్ లు..! -
ఉమెన్స్ డే వేళ ఊహించని కానుక: ప్రతి నెలా రూ.1500! -
BREAKING: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్- నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
టెన్త్ పాస్ అయితే చాలు నెలకు రూ.1500-ఖాతాల్లో జమ ప్రారంభం..!












Click it and Unblock the Notifications