ఇంత దుర్మార్గమా, జగన్ పార్టీ క్షమాపణ చెప్పాలి: బాబు డిమాండ్
రాష్ట్ర ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
చదవండి: జగన్ వద్దకు ప్రశాంత్ కిషోర్: బిజెపి నేత ఐడియానా, బాబుకు చెక్?
విభజన హామీలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడినట్లు చెప్పారు. పోలవరం ఏపీ జీవనాడి అని, దీనిని ఆపేందుకు కాంగ్రెస్, వైసిపిలు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.

సోమవారం పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్, వైసిపిలు ప్రవర్తించిన తీరు దారుణమని, ప్రాజెక్టు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రా రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.
చదవండి: ఏపీకి మూడో స్థానం: 'జగన్ ఇప్పుడేం చెప్తారు, దానిపై ఇప్పటి దాకా చెప్పలేదు'
ఏడు మండలాలను కలపకుంటే పోలవరం సాకారమయ్యేదా అని ప్రశ్నించారు. అది కలగానే మిగిలిపోయేదన్నారు. తాము త్వరితగతిన పూర్తి చేస్తామని బాధ్యతను తమకు అప్పగించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, కాకినాడ వద్ద పెట్రోలియం కారిడార్ అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications