కడపలో జగన్కు చెక్-బాబుకు చిక్కులు: డిఎల్ డైలమా, సుధాకర్ అసంతృప్తి?
2019 ఎన్నికల్లో వైసిపి అధినేత వైయస్ జగన్కు సొంత ఇలాకాలోనే చుక్కలు చూపించేందుకు అధికార టిడిపి పావులు కదుపుతోంది. ఇప్పటికే కడప జిల్లా నుంచి పలువురు నేతలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు.
కడప: 2019 ఎన్నికల్లో వైసిపి అధినేత వైయస్ జగన్కు సొంత ఇలాకాలోనే చుక్కలు చూపించేందుకు అధికార టిడిపి పావులు కదుపుతోంది. ఇప్పటికే కడప జిల్లా నుంచి పలువురు నేతలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు.
చదవండి: బాబుకు షాకిస్తారా: పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాక.. జనసేనతో టచ్లో బోండా ఉమ?

కడప జిల్లాలో టిడిపి గెలిచింది ఒక్కటే సీటు
2014 ఎన్నికల్లో కడప జిల్లాలో టిడిపి కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకకవర్గంలో మాత్రమే గెలిచింది. ఇప్పుడు 2019లో మాత్రం ఏకంగా సాధ్యమైతే పులివెందులలోనే జగన్ను ఓడించడం లేదా ఆయన మెజార్టీనా భారీగా తగ్గించడం చేయాలని చూస్తున్నారు.

ఈసారి కడపలో జగన్కు షాకిచ్చేందుకు
కడప పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకొని వైయస్ జగన్కు గట్టి షాకివ్వాలని టిడిపి భావిస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టిడిపిలో చేరారు. ఆదినారాయణను ఏకంగా మంత్రిని చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించి కడపలో తన ఉనికిని నిరూపించుకొని జగన్కు భారీ షాకిచ్చింది.

టిక్కెట్పై పోటీ లేకుండా సుధాకర్ యాదవ్కు టిటిడి పదవి
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో సత్తా చాటాలని టిడిపి భావిస్తోంది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మైదుకురు టిడిపి ఇంచార్జ్ సుధాకర్ యాదవ్ను తప్పించి, డిఎల్ రవీంద్రా రెడ్డిని పార్టీలోకి తీసుకొని, ఆయనకు నియోజవకవర్గాన్ని అప్పగించాలని చూస్తోందని అంటున్నారు. ఇందుకోసం సుధాకర్ యాదవ్కు టిటిడి పదవి ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో పోటీ లేకుండా ఉండేందుకు బాబు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

మైదుకూరులో ప్రతి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానిదే హవా
మైదుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికలను పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గానిదే గెలుపు. 2014లోనూ వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతిలో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఓటమి చవి చూశారు. గతంలోను డిఎల్ రవీంద్రా రెడ్డిదే హవా. ఆయన 1989, 1994, 2004, 2009లలో గెలిచారు.

అందుకే డిఎల్కు బాబు గాలం
దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన, నియోజకవర్గంలో పలుమార్లు గెలిచిన డిఎల్ రవీంద్రా రెడ్డికి టిక్కెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో టిడిపికి లాభిస్తుందని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే డీఎల్కు గాలం వేశారని అంటున్నారు.

సుధాకర్ యాదవ్ అసంతృప్తి
మైదుకూరులో ఓడినప్పటికీ సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు మూడేళ్లుగా కృషి చేస్తున్నారు. 2019లో టిక్కెట్, గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం గెలుస్తుందనే ఉద్దేశ్యంతో తనను పక్కకు తప్పించడంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో భేటీ కానున్నారని అంటున్నారు. డీఎల్ కోసం తనను బలిపశువును చేస్తున్నారని వాపోతున్నారట. అదే సమయంలో మైదుకూరు నుంచి తప్పించినా టిటిడి చైర్మన్ వంటి మంచి పదవి వస్తుందని ఆయన వర్గంలోని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

డిఎల్ రవీంద్రా రెడ్డి డైలమా
తాను టిడిపిలోకి వస్తే మైదుకూరు టిక్కెట్ తనకు ఇచ్చేందుకు సుధాకర్ను టిటిడి చైర్మన్గా పంపిస్తారని తెలిసినప్పటికీ.. డీఎల్ రవీంద్రా రెడ్డి పచ్చ కండువా కప్పునే విషయంలో డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే టిడిపిలోకి వెళ్తానంటే తొందరపాటు అవుతుందని, వేచి చూద్దామనే ధోరణిలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications