హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ర్యాంక్ చూసి షాకయ్యా: బాబు, ఇదీ విషయం, ఆ ఎమ్మెల్యేలకు షాక్, వేరే అభ్యర్థులు?

సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీకి పదిహేనవ ర్యాంకు వచ్చిందన్న మీడియా వార్తలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీకి పదిహేనవ ర్యాంకు వచ్చిందన్న మీడియా వార్తలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు.

Recommended Video

బాబు జోక్స్ కి అవాక్కయిన ఎమ్మెల్యేలు Chandrababu Making Fun With MLAs | Oneindia Telugu

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: తెలంగాణ, హైదరాబాద్‌కు అగ్రస్థానం, ఏపీ వాదన ఇదీఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: తెలంగాణ, హైదరాబాద్‌కు అగ్రస్థానం, ఏపీ వాదన ఇదీ

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌లో తుది ర్యాంకులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ముగియక ముందే రాష్ట్రానికి 15వ ర్యాంకు వచ్చినట్టుగా వచ్చిన వార్తను చూసి విస్మయం చెందానని చంద్రబాబు అన్నారు.

పని చేయలేదని, ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా: బాబుపై పురంధేశ్వరిపని చేయలేదని, ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా: బాబుపై పురంధేశ్వరి

 ఆ వార్త చూసి షాకయ్యా

ఆ వార్త చూసి షాకయ్యా

పత్రికలో వార్త చూసి తాను షాకయ్యానని, ఎందుకు ఇలా వచ్చిందో ఒక్క నిమిషం తనకు ఏమీ అర్ధం కాలేదని, వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చంద్రబాబు చెప్పారు.

 నా పరిస్థితే ఇలా ఉంది, జనాలు ఎలా

నా పరిస్థితే ఇలా ఉంది, జనాలు ఎలా

నా పరిస్థితే అలా ఉంటే, సామాన్య ప్రజలు ఆ వార్తను చదివి నిజమే అనుకుంటారు కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియా అత్యుత్సాహం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కూడా మన రాష్ట్రం మంచి ర్యాంకులో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 ఇదీ అసలు విషయం!

ఇదీ అసలు విషయం!

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తుది ర్యాంకులు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు తెలిపారు. తుది ర్యాంకులు ప్రకటించే వరకు అప్పటికి అప్‌లోడ్‌ చేసిన వివరాల్ని బట్టి రాష్ట్రాల స్థానాలు మారుతూ ఉంటాయన్నారు. తుది ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

 నిత్యం పోటీ ఉంటుంది

నిత్యం పోటీ ఉంటుంది

ఇందుకు చంద్రబాబు మాట్లాడుతూ.. ఏదేమైనా నిత్యం పోటీ ఉంటుందని, మనమే తెలివైన వాళ్లమనుకుంటే సరిపోదని, అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉంటున్నాయని, పోటీ పడుతున్నాయని, ఎప్పటికప్పుడు మరింత తెలివిగా, సమర్థంగా వ్యవహరించాలన్నారు.

 అభ్యర్థుల్ని మార్చమంటారా, అల్టిమేటం

అభ్యర్థుల్ని మార్చమంటారా, అల్టిమేటం

ఇదిలా ఉండగా, ఇంటింటికీ టీడీపీపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించని వారికి అక్షింతలూ చేసిన విషయం తెలిసిందే. ఇలా అయితే కష్టమని, మీరు మారతారా? లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రత్యామ్నాయంగా వేరే అభ్యర్థుల్ని సూచిస్తారా, నన్ను సూచించమంటారా? తేల్చుకోమని నేతలకు అల్టిమేటం జారీ చేశారు.

 సమావేశాల బహిష్కరణ జగన్ సెల్ఫ్ గోల్

సమావేశాల బహిష్కరణ జగన్ సెల్ఫ్ గోల్

శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించుకోవడం సెల్ఫ్ గోల్ అని మంత్రి అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu responded on ease of doing business rankings. According to media reports Andhra Pradesh got 15th rank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X