వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ఘనస్వాగతం: నీతి ఆయోగ్ సమావేశం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు బుధవారం స్వచ్చ భారత్ సమావేశానికి హాజరు కావడానికి బెంగళూరు చేరుకున్నారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆయన ప్రతేక వాహనంలో విధాన సౌధ చేరుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చంద్రబాబు నాయుడుకు కర్ణాటక సంప్రదాయం ప్రకారం శాలువా కప్పి మైసూరు పేటాతో ఘనంగా సన్మానించారు. ఇదే సందర్బంలో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్య ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అనంతరం స్వచ్చ భారత్ సమావేశంలో పాల్గోన్నారు. స్వచ్చ భారత్ పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

జాతిపిత మహాత్మగాంధీ 150వ పుట్టిన రోజు వేడుకలు 2019 అక్టోబర్ 2వ తేది జరగనున్నాయి. అంతలోపు స్వచ్చ భారత్ కల నెరవేరాలని, అందుకు తీసుకోవలసిన చర్యల మీద ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారని తెలిసింది.

నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సింధూశ్రీ పుల్లర్, కేంద్ర గ్రామీణాభి వృద్ది శాఖ కార్యదర్శి సరస్వతి ప్రసాద్ తో పాటు పలు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి మీడియాకు కేవలం మూడు నిమిషాలు మాత్రం అనుమతి ఇవ్వడంతో కొంత గందరగోళం నెలకొంది.

English summary
The Andhra Pradesh chief minister N Chandrababu Naidu will preside over the Sub-Group: Meeting of the Chief Ministers on Swachh Bharat Mission of the Neeti Aayog of the Union Government at the Conference Hall of Vidhana Soudha in Bengaluru on June 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X