Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రామ పంచాయితీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

పేద ప్రజల ఆదాయాన్ని పెంచి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతామని... ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషన్ వేరు

వినుకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "పౌరుషాల గడ్డ పల్నాడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషనే వేరుగా ఉంటుంది. ఇటీవల కోటప్పకొండలో శివరాత్రి ఉత్సాహంగా జరిగింది. భక్తులతో దద్దరిల్లింది. కోటప్పకొండ తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి ప్రభలు అంటే కోటప్పకొండ ప్రభలే గుర్తుకు వస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి. నేను గతంలో ముఖ్యమంత్రిగా పచ్చదనం-పరిశుభ్రత, నీరు-మీరు, ఆకస్మిక తనిఖీలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. స్వచ్ఛాంద్ర అంటే రోడ్లు ఊడ్చే కార్యక్రమం కాదు. స్వచ్ఛత మన జీవిన విధానంలో భాగం కావాలి" అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

పరిసరాల శుభ్రత.. మన బాధ్యత

"రాష్ట్రంలోని ప్రతి మండలానికో స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నాం. వారానికోసారి రథాలు గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికి రాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. అన్నింటికంటే మనకు ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పరిసరాలు, శుభ్రమైన కార్యాలయాలు, గ్రామాలు ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. వర్షాలకు ఆ చెత్త భూమిలో ఇంకి తద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది.

chandrababu Naidu Will Increase Poor Income Fill Lives with Happiness 100 Garbage Collection Soon

నూటికి 97 శాతం మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. వచ్చే నెల కల్లా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం ఇంటింటికీ చెత్త సేకరిస్తాం. రాష్ట్రంలో 4,14,004 కుటుంబాలు హోం కంపోస్టింగ్ చేస్తున్నారు. 4,19,288 టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులో రూ.1,254 కోట్లతో పీపీపీ విధానంలో 'వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల' ను మార్చి 15కల్లా వినియోగంలోకి తీసుకువస్తాం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ

"రాష్ట్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించాం. ప్లాస్టిక్ వల్ల ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించటం, విద్యుత్ ఉత్పత్తి లాంటివి చేస్తున్నాం. చెత్త సేకరణ కోసం ట్రై సైకిళ్లు, ఈ-ఆటోలు, వివిధ యంత్రాలను వినియోగిస్తున్నాం. విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. రాజమండ్రి సహా మరో 5 ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేందుకు చర్యలు చేపడతాం. చెత్త, వ్యర్ధాల నిర్వహణలో మన ఆలోచనా తీరు మారాలి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి సంక్రమిత వ్యాధులు తడి వ్యర్ధాల కారణంగానే వస్తున్నాయి. జపాన్ లో రోడ్లపై చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు. అక్కడి పౌరుల తరహాలో మనమూ కొన్ని అలవాట్లను మార్చుకోవాలి" అని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయి

"రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పెను మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాం. నేను స్వయంగా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంలో దేశంలోని మరే రాష్ట్రంలోనూ మన దరిదాపుల్లో లేదు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

"స్త్రీశక్తి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలకు మెరుగైన ఆరోగ్యసేవలు అందిస్తాం. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. గిట్టుబాటు ధర వచ్చే పంటలనే రైతులు వేయాలని కోరుతున్నాను. వారసత్వంగా వచ్చే పంటలనే పండిస్తే ఆదాయం తక్కువ వచ్చి ఇబ్బందులు వస్తాయి. రైతుకు టెక్నాలజీ అలవాటు చేస్తున్నాం. ఏఐ ద్వారా వ్యవసాయ నిపుణుణ్ని అందుబాటులోకి తెచ్చి రైతుకు శిక్షణ అందిస్తాం" అని తెలిపారు.

"ఇటీవల బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మనవాళ్ల టెక్నాలజీ వినియోగాన్ని మెచ్చుకున్నారు. మైక్రో ఇరిగేషన్‌లో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తున్నాం. అందులో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మొదట్నుంచీ డ్వాక్రా మహిళలు నాకు అండగా ఉన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారుచేసే బాధ్యత తీసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

chandrababu Naidu Will Increase Poor Income Fill Lives with Happiness 100 Garbage Collection Soon

పీ4తో పేదలకు ఆర్థిక చేయూత

"సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే పీ4 కింద లక్షమంది మార్గదర్శులు... 10 లక్షల మంది పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అట్టడుగున ఉండే 20 శాతం బంగారు కుటుంబాలు, పైన ఉండే 10 శాతం మార్గదర్శులు కలిసి పనిచేస్తే రేపటి రోజున ఈ బంగారు కుటుంబాలే మార్గదర్శులు అవుతారు. పీ4 ద్వారా 100 కుటుంబాలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుని అభినందిస్తున్నాను. ఈ పథకం ద్వారా మరింతమంది పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు మరికొందరు ముందుకు రావాలి" అని సీఎం చంద్రబాబు కోరారు.

ఢిల్లీలో ఏఐ సదస్సు సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన దారుణం

"ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సుకు నేను హాజరయ్యాను. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. సుమారు 60 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఏఐ ఏం చేస్తుందో తెలిపారు. ఢిల్లీలో ఇంతమంచి సదస్సు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్లు దారుణంగా ప్రవర్తించారు. ఓవైపు ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకుపోతుంటే.. యువత ప్రయోజనాలు కాపాడాల్సిన పార్టీలు అర్ధనగ్న ప్రదర్శన చేయడం నన్ను బాధించింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ తరహా శైలి దేశానికి నష్టం చేస్తుంది" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

chandrababu Naidu Will Increase Poor Income Fill Lives with Happiness 100 Garbage Collection Soon

"మన రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏం జరిగిందో చూశాం. ఏపీ అంటే అందరూ ఛీ కొట్టారు. పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేశారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు గొప్ప విజయం అందించారు. కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా వెంటనే ప్రజల కోసం అమలు చేయడం నాకు అలవాటు. 1995లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ కట్టాను. 25 ఏళ్లలో దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అందుకు మన దూరదృష్టే కారణం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తొంది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీకి చిరునామా చేస్తాం. విశాఖలో భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మెగా డీఎస్సీ ద్వారా 15,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదే. రోడ్ల మరమ్మతులు చేపడుతున్నాం. కరెంటు చార్జీలు పెంచబోం. వినుకొండ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని 1000 పడకల ఆస్పత్రిగా మార్చుతాం. ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. వినుకొండలో అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. బస్టాండ్ ను ఆధునీకరిస్తాం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

chandrababu Naidu Will Increase Poor Income Fill Lives with Happiness 100 Garbage Collection Soon

స్టాళ్ల సందర్శన... ఉత్పత్తుల పరిశీలన

వ్యర్ధాల సేకరణ కోసం వినియోగించే స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. దాచేపల్లికి చెందిన స్వచ్ఛ రథం డ్రైవర్ దుర్గారావు, హోం కంపోస్టింగ్ విభాగంలో లక్ష్మీ గోవిందమ్మను ముఖ్యమంత్రి సత్కరించి అవార్డులు అందజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+