ఎపికి హోదా కావాలని చంద్రబాబు అసలు అడగలేదా?
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిపై తెలుగుదేశసం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సంచలన ప్రకటన చేశారు. చెన్నైలో మీడియాతో ఆయన అసలు విషయం చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఏ రోజు కూడా అడగలేదని ఆయన చెప్పారు. విభజన జరిగినప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు డిమాండ్ చేసినట్లు, నేడు 2.25 లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఆయనయ తెలిపారు. మరి అన్ని కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు ఏం చేసినట్లు అనే అనుమానం జనాలకు కలుగుతోందని ఆయన అన్నారు.

అసలు ప్రత్యేక హోదా అనేది కేవలం బిజెపికి సంబంధించిన విషయం మాత్రమేనని, విభజన సమయంలో వెంకయ్య నాయుడు హోదా ప్రస్తావన తేకుంటే ఎవరికీ ఆ విషయం తెలిసేది కాదని, ఎవరూ అడిగే వారు కాదని ఆయన అన్నారు. నాటి ప్రధాని ఐదేళ్లు హోదా ఇస్తామంటే వెంకయ్య, జైట్లీ మాత్రం పదేళ్లు అడిగారని ఆయన గుర్తు చేశారు.
ఎపి ప్రజలు దిక్కు లేకుండా చెట్టు కింద ఉన్నారని, ఆదుకునే వాళ్లను ఎందుకు వద్దనాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ప్రయోజనం లేదని కేంద్రం అంటోందని, లాభం లేనప్పుడు ఇస్తే ఏం నష్టం వస్తుందని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదని ఆయన అన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications