‘పొలం పిలుస్తోంది’: నాగలి పట్టిన చంద్రబాబు(పిక్చర్స్)
విశాఖపట్నం: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం ‘పొలం పిలుస్తోంది' అనే వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంత వరకు నిత్యా శ్రామికుడిగా పని చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను, సంస్థలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు. ప్రతి రైతును ఆదర్శ రైతుగా మార్చే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వారానికో జిల్లాలో పర్యటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న వసతులను గ్రామాల్లో కల్పిస్తామని చెప్పారు. పోలవరం నిర్మిస్తే విశాఖపట్నం సస్యశ్యామలం అవుతందని అన్నారు. 35వేల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారని, లక్షా 30వేల మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు
విశాఖపట్నంలో శుక్రవారం ‘పొలం పిలుస్తోంది' అనే వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు
పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
చంద్రబాబు
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంత వరకు నిత్యా శ్రామికుడిగా పని చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.
చంద్రబాబు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను, సంస్థలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు
రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు. ప్రతి రైతును ఆదర్శ రైతుగా మార్చే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వారానికో జిల్లాలో పర్యటిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
చంద్రబాబు
పట్టణ ప్రాంతంలో ఉన్న వసతులను గ్రామాల్లో కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు
పోలవరం నిర్మిస్తే విశాఖపట్నం సస్యశ్యామలం అవుతందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
35వేల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారని, లక్షా 30వేల మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు
చెరకు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్తో దిగుబడులు పెంచుతామన్నారు.
చంద్రబాబు
సహకారం రంగంలో అగ్రగామిగా వున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.
చంద్రబాబు పూజలు
రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. క్రషింగ్ సామర్థ్యాన్ని నాలుగు వేల టన్నుల నుంచి ఎనిమిది వేల టన్నులకు పెంచుతామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు పూజలు
కోజనరేషన్ ప్లాంట్ ద్వారి విద్యుత్ ఉత్పత్తిని కూడా రెట్టింపు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో డిస్టిలరీ, చెరకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికను తయారు చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.