వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమాభారతితో చంద్రబాబు సమావేశం రద్దు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం రద్దయింది. ఉమాభారతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో చంద్రబాబుతో ఉమాభారతి ఫోన్‌లోనే మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Chandrababu phoned to Uma Bharti

తెరాసతో జగన్ కుమ్మక్కు: దూళిపాళ్ల

అధికారం కోసం జగన్ శవరాజకీయాలు చేశారని, తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మక్కయ్యారని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ నిందితుడు అన్నారు. అలాంటి బొత్స మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

కోర్టు పరిధిలో ఉండాల్సిన ఆడియో టేపులు బయటకు ఎలా వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం సృష్టించాలని కుట్ర చేస్తున్నారన్నారు. నిజ స్వరూపాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్తామని దూళిపాళ్ల నరేంద్ర చెప్పారు.

English summary
AP CM Nara Chandrababu Naidu phoned to Uma Bharti
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X