పరిస్థితి చెప్తా, రాజకీయాలు మాట్లాడను: ఢిల్లీలో బాబు
న్యూఢిల్లీ: తాను ఎవరితోను రాజకీయాలు మాట్లాడనని, రాష్ట్రంలోని తాజా పరిస్థితులు వివరించి అనుచిత పరిస్థితులు తొలగించాలని కోరుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం చెప్పారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో చంద్రబాబు ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలను తాను కలుస్తానని, రాష్ట్రంలోని అనుచిత పరిస్థితిని వారికి వివరిస్తానని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరుతానన్నారు. తాను ఎవరితోను రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. ఈ రోజు, రేపు ఇక్కడే ఉంటామని, అందరికీ రాష్ట్ర పరిస్థితులు వివరిస్తామన్నారు.

కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, దిగజారిన ఆర్థిక పరిస్థితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసు వ్యవహారంపై ఆయన రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలను కలువనున్నారు. ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు చెప్పారు.
చంద్రబాబు వెంటే తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎల్ రమణ, సీమాంధ్ర నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, కెఈ కృష్ణమూర్తి, కోడెల శివప్రసాద్, అయ్యన్న పాత్రుడు తదితరులు ఉన్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications