అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపి: చంద్రబాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆర్థిక సంస్కరణలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నగరంలోని బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో గురువారం రాత్రి గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దశాబ్ది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు ఖచ్చితత్వం, దూరదృష్టి ఉండాలని.. బాధ్యతగా పని చేయాలని అన్నారు.
దేశ ప్రగతికి ఆర్థిక సంస్కరణలు ఎంతో ముఖ్యమని తెలిపారు. 2020నాటికి యువ దేశంగా మారనున్న భారత్కు దిశానిర్దేశం చేసే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని చంద్రబాబు అన్నారు. రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుపుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు రూపొందించిన ‘గ్లోబల్ మైండ్సెట్ ఇండియన్ రూట్స్-థాట్ లీడర్ షిప్ అండ్ బియాండ్' అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
గ్రేట్ లేక్స్ సంస్థ ఛైర్మన్ ప్రొఫెసర్ బాల వి. బాలచంద్రన్, పీపుల్ క్యాపిటల్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు ఎండి శ్రీనిరాజు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సిఈఓ జివి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు
ఆర్థిక సంస్కరణలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు
నగరంలోని బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో గురువారం రాత్రి గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దశాబ్ది వేడుకలను నిర్వహించారు.
చంద్రబాబు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు ఖచ్చితత్వం, దూరదృష్టి ఉండాలని.. బాధ్యతగా పని చేయాలని అన్నారు.
చంద్రబాబు
దేశ ప్రగతికి ఆర్థిక సంస్కరణలు ఎంతో ముఖ్యమని తెలిపారు. 2020నాటికి యువ దేశంగా మారనున్న భారత్కు దిశానిర్దేశం చేసే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు రూపొందించిన ‘గ్లోబల్ మైండ్సెట్ ఇండియన్ రూట్స్-థాట్ లీడర్ షిప్ అండ్ బియాండ్' అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.