తెలంగాణ ప్రాజెక్టులపై బాబు గర్జన: కెసిఆర్కు బిజెపి అపీల్
గన్నవరం/ హైదరాబాద్: ఎగువన నిర్మించే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతుండగా ఉదారంగా వ్యవహరించాలని బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ముఖ్మమంత్రి కె. చద్రశేఖర రావును కోరారు.
ఎగువనుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన నీటి కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సభలో శుక్రవారం సాయంత్రం ఆ విధంగా అన్నారు. ఎగువన ప్రాజెక్టులు కడితే తమ రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుందని, ఎగువన కట్టే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
పోలవరం కాలు ద్వారా బ్రహ్మచెరువుకు నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే, ప్రాజెక్టులు నిర్మించే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సహృదయతతో ఆలోచించాలని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతే రాయలసీమ ప్రజలు వలస పోవాల్సి వస్తుందని అన్నారు.
తాను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ గురించి ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications