'మోడీతో బాబు అమీతుమీ తేల్చుకోవాలి': వీహెచ్పై కామినేని ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి సోమవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పైన చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.
పది నెలల చంద్రబాబు పాలనలో ఎనిమిది నెలలు విదేశాల్లోనే తిరిగారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

విహెచ్పై కామినేని ఆగ్రహం
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు పైన ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు మండిపడ్డారు. వీహెచ్ నక్షత్రకుడు లాంటివారని, వీహెచ్ వల్లే రాష్ట్రం విడిపోయిందని దుయ్యబట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని పదవులు సంపాదిస్తారన్నారు. వీహెచ్ వల్ల రాష్ట్రానికి ఏ పనీ కాదన్నారు.
నిధుల్లో కోత: రేవంత్ రెడ్డి
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. అధికారం కోసం తెరాస నేతలు కొట్టుకునే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications