ఆళ్లగడ్డ సస్పెన్స్: బాబుపై ఒత్తిడి, జగన్కు షాకిచ్చేనా?
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనే డిమాండ్ స్థానిక నేతల నుండి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా.. శుక్రవారం టీడీపీ యువనేత నారా లోకేష్ కర్నూలు జిల్లాలతో మాట్లాడటం, గంగుల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే టీడీపీ పోటీ పైన పలురకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు సాయంత్రం మాట్లాడారు. ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయాలన్నారు. నందిగామకు, ఆళ్లగడ్డకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు.
హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు తిరిగి వచ్చాక ఆళ్లగడ్డలో పోటీ విషయమై చర్చిస్తామని, ఆయనే పోటీ పైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అయితే, హుధుద్ తుఫాను ప్రభావం తగ్గే వరకు తాను విశాఖ నుండి రానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాదే వచ్చి నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సాధ్యమని చర్చ సాగుతోంది.
విశాఖలోనే చంద్రబాబు దీని పైన నిర్ణయం తీసుకోవచ్చునని కూడా చెబుతున్నారు. అయితే, సాధ్యమైనంత వరకు పోటీకి దూరంగా ఉండే అవకాశమే ఉందని చెబుతున్నారు. అయితే, చివరి నిమిషంలో టీడీపీ పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని మరికొందరు అంటున్నారు.
మన పార్టీలలో ఉన్న సంప్రదాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇప్పటికే టీడీపీ ప్రకటించి ఉండేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే, ఆమె ఎన్నికలకు ముందే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
బ్యాలెట్ పేపర్లో ఆమె పేరు తీసివేసేందుకు ఈసీ నిరాకరించింది. దీంతో, ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించిన శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు శోభ కూతురు అఖిల ప్రియ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications