చెన్నై వందేభారత్ నర్సాపురంకు పొడిగింపు, మరో రెండు హాల్టులు - కొత్త టైమింగ్స్..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న వందేభారత్ నర్సాపురం వరకు పొడిగింపు నిర్ణయానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ రైలుకు గుడివాడతో పాటుగా భీమవరంలోనూ హాల్టింగ్ సౌకర్యం కల్పించింది. ఈ రైలు పొడిగింపుతో తాజా టైమింగ్స్ ను ఖరారు చేసింది. దీని ద్వారా ఇక నుంచి గోదావరి వాసులు చెన్నై వెళ్లేందుకు వందేభారత్ ద్వారా మరింత వెసులుబాటుగా మారనుంది. త్వరలోనే ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.
రైల్వే బోర్డు గోదావరి వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై సెంట్రల్ - విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే వందేభారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10 కి చేరుకుంటోంది. ఇక, ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించటంతో ఈ సర్వీసు 11.45 గంటలకు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి 11.50కి బయల్దేరి.. మధ్యాహ్నం 12.25కి గుడివాడ, 1.30కి భీమవరం, 2.10 కి నర్సాపురం చేరుకుంటుంది.

ఇక, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10 కి గుడివాడ, 4.50 కి విజయవాడ చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50 కి రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. ఇక.. తాజాగా పొడిగించిన మేరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం ప్రారంభం కానుంది. నర్సాపురంలో ఈ రైలు సర్వీసును అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా మరో వందేభారత్ సర్వీసు ప్రారంభం పైన అధికారులు ఫోకస్ చేసారు. త్వరలోనే ఈ సర్వీసు పైనా నిర్ణయం ఉంటుందని .. ఇప్పటికే షెడ్యూల్ సైతం ఖరారైందని అధికారులు వెల్లడించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications