రూ.25 లక్షల అప్పు, విచారణలో నేరం రుజువు: కేశవ రెడ్డికి కోర్టు షాక్
చెల్లని చెక్కు కేసులో నిందితుడైన కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డికి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది.
కర్నూలు: చెల్లని చెక్కు కేసులో నిందితుడైన కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డికి ఏడాది జైలుశిక్ష, చెక్కు మొత్తం రూ.25 లక్షలు రెండు మాసాల్లో చెల్లించాలని కర్నూలు ఎక్సైజ్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
వెల్దుర్తికి చెందిన బాలయ్య అనే వ్యక్తి వద్ద కేశవ రెడ్డి 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు.

తిరిగి చెల్లించేందుకు 2015 ఏప్రిల్ 15వ తేదీతో ఆయన చెక్కు ఇచ్చారు. బ్యాంకులో చెక్కు చెల్లకపోవటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
విచారణలో నేరం రుజువు కావటంతో కేశవ రెడ్డికి జైలుశిక్షతోపాటు చెక్కు మొత్తం చెల్లించాలని న్యాయమూర్తి బాలకోటేశ్వర రావు తీర్పు ఇచ్చారు.












Click it and Unblock the Notifications