రూ.25 లక్షల అప్పు, విచారణలో నేరం రుజువు: కేశవ రెడ్డికి కోర్టు షాక్
చెల్లని చెక్కు కేసులో నిందితుడైన కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డికి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది.
కర్నూలు: చెల్లని చెక్కు కేసులో నిందితుడైన కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డికి ఏడాది జైలుశిక్ష, చెక్కు మొత్తం రూ.25 లక్షలు రెండు మాసాల్లో చెల్లించాలని కర్నూలు ఎక్సైజ్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
వెల్దుర్తికి చెందిన బాలయ్య అనే వ్యక్తి వద్ద కేశవ రెడ్డి 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు.

తిరిగి చెల్లించేందుకు 2015 ఏప్రిల్ 15వ తేదీతో ఆయన చెక్కు ఇచ్చారు. బ్యాంకులో చెక్కు చెల్లకపోవటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
విచారణలో నేరం రుజువు కావటంతో కేశవ రెడ్డికి జైలుశిక్షతోపాటు చెక్కు మొత్తం చెల్లించాలని న్యాయమూర్తి బాలకోటేశ్వర రావు తీర్పు ఇచ్చారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications