వైసీపీలో బాలినేని అంత చేశారా..?
మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని వ్యాఖ్యలకు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ సహించరని ఆయన తెలిపారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సీఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు.
బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని చెవిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారనే ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని.. జగన్ గురించి వ్యక్తిగతంగా విమర్శించి మాట్లాడడం సరికాదని.. స్పెషల్ ఫ్లైట్స్లో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛను..బాలినేనికి జగన్ ఇచ్చారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు.

అలాగే వైసీపీ పార్టీలో బాలినేనికి ఎంతో గౌరవం ఇచ్చారని.. బ్లాక్మెయిల్తో జగన్ను బాలినేని ఇబ్బంది పెట్టాడని, అయినప్పటికి బాలినేనిని జగన్ భరించారని చెవిరెడ్డి అన్నారు. కూటమితో కలిసి జగన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని, ఎన్నికష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని, 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతోనే ఉన్నా.. తాను ఏ పార్టీ మారలేదని.. మరో జెండా పట్టుకోలేదని, ఒంగోలు ప్రజలతో తనకు అనుబంధం ఉందని.. తాను నిత్యం ప్రజలు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications