పవన్ అభిమానుల మృతి కలిచివేసిందన్న చిరంజీవి .. రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి
నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు . పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు జనసేన పార్టీ నాయకులలోనూ, పవన్ అభిమానుల్లోనూ విషాదం నెలకొంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కనమలదొడ్డిలో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

పవన్ అభిమానుల మృతిపై చిరంజీవి ఆవేదన
కుప్పం పలమనేరు రహదారి పక్కన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని 30 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేయడానికి పైకెక్కి పని చేస్తున్న వారికి విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన వెంటనే స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పవన్ పుట్టిన రోజు నాడు నెలకొన్న విషాదంతో ఈ ఘటనపై స్పందించిన చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు .

మీ కుటుంబాలకు మీరే సర్వస్వం .. చిరంజీవి ట్వీట్
పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరులో బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించడం నా గుండెను కలిచివేసింది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన పేర్కొన్నారు . అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు కానీ మీ ప్రాణాలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటన తన మనసు తీవ్ర వేదన కలిగించిందని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ట్వీట్ .. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు
మరోపక్క పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు అభిమానులు మృతి చెందడంపై రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు .మీరు ఎల్లప్పుడూ ఇది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి అని నా మనవి అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

పుట్టిన రోజున విషాదంలో జనసేనాని పవన్ కళ్యాణ్
జనసైనికుల మరణం మాటలకందని విషాదం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన అభిమానులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన చికిత్సపొందుతున్న వారికి తగిన వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications