గుడ్ న్యూస్ చెబుతున్న సీఎం చంద్రబాబు, సొంత నియోజక వర్గంలో సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో అభివృద్ధి పనులు ఊపందుకోవడానికి ఆ నియోజక వర్గం టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.
కుప్పం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి భూసేకరణ విషయంలో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, డీకేటీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని సర్వే చేసిన టీడీపీ నాయకులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు.

మహిళల కోసం టెక్స్ టైల్స్ పార్క్ లు కూడా ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటున్నారని కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఉపాధి కోసం ప్రతిరోజు రైలులో బెంగళూరు వెళ్లి పని చేస్తూ రాత్రి తిరిగి కుప్పం చేరుకుంటున్నారు. బెంగళూరు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి కుప్పం నియోజకవర్గంలోనే ఉపాధి కల్పించడానికి టీడీపీ తగిన చర్యలు తీసుకుంటున్నదని తెలిసింది.
పరిశ్రమల ఏర్పాటు విషయంలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలోని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూముల వివరాల సేకరించిన అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి భూసేకరణ కోసం అధికారులు రంగంలోకి దిగారు.
మొత్తం మీద కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకి సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో గుడ్ న్యూస్ చెబుతారని తెలిసింది. కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమలతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే కుప్పంకు భారీ ఎత్తున నిధులు మంజూరు అవుతాయని ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications