Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి:కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారులు కూడా ప్రజలను అప్రమప్తం చేయాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విపత్తు నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని, వారితో రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు.

 CM Chandrababu Review Meeting on Rains and Floods in Andhra Pradesh

అలాగే సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వర్షాలు పడుతున్న జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో ప్రత్యామ్నాయం, పునర్నిర్మాణం చేయాలన్నారు.

Recommended Video

    బిక్కుబిక్కుమంటున్న కోనసీమవాసులు

    ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల్లో వరదని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాల్సిందిగా అధికారులకు సూచించారు. దివిసీమలో ఒకేరోజు 24 మంది పాము కాట్లకు గురైన నేపథ్యంలో సిఎం ఆ విషయంపై దృష్టి సారించారు. రైతులు, కూలీలు విష సర్పాల బారిన పడకుండా చూడాలని, పాముల ఉనికి విషయమై వారికి జాగ్రత్తలు తెలియచెప్పాలని అధికారులను హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+