సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపించడానికి శతవిధాల కృషి చేస్తోంది. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడం మాత్రమే కాక, ప్రజలకు అవసరమయ్యే విధంగా పలు నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్ర తీరం వెంట సి షోర్ హైవే నిర్మాణం కోసం ప్రణాళికలను రూపొందించింది.
సి షోర్ హైవేపై ప్రభుత్వ నిర్ణయం
కత్తిపూడి-ఒంగోలు నేషనల్ హైవే-216 విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120కిలోమీటర్ల పొడవున ఈ సి షోర్ హైవే నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. మచిలీపట్నం పోర్టు కోసం గతంలో నేషనల్ హైవే-216 విస్తరణను పరిశీలించారు. కానీ, భూసేకరణ, అధికవ్యయం అవుతున్న కారణంగా సీషోర్ హైవే ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది.

మత్స్య, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు సీషోర్ హైవే
ఇది తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అంచనా. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర దీనిని ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఈ సీషోర్ హైవే మత్స్య, ఆక్వా ఉత్పత్తుల రవాణాకుమాత్రమే కాదు పర్యాటకులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులను కలుపుతూ మత్స్య, వ్యవసాయం, కొబ్బరి రవాణాకు ఇది కీలకంగా ఉంటుంది.
భూసేకరణ లేకుండానే ఈ ప్రాజెక్టు
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల మధ్య అనుసంధానాన్ని ఈ రహదారి మెరుగుపరుస్తుంది. నేషనల్ హైవే-216 రద్దీని ఈ రహదారి తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు, ముఖ్యంగా ఉప్పాడ వంటి ప్రాంతాలకు దీంతో రవాణా వేగవంతం అవుతుంది. తీరప్రాంత నియంత్రణ నిబంధనలు రోడ్లకు ఆటంకం కావని అధికారులు స్పష్టం చేయడంతో, భూసేకరణ లేకుండానే ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని భావిస్తున్నారు.
పర్యాటక రంగానికి ఊతం
ఈ హైవే ఏపీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. పర్యాటక రంగానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తుంది. బీచ్లకు మెరుగైన అనుసంధానం లభించి, పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా హోటళ్లు, రిసార్టులు వంటి వసతులు పెరుగుతాయి. కాలువలు సముద్రంలో కలిసే చోట ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ వివరాలను కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలలో పొందుపరిచారు.
-
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
చెరువుల పక్కన ప్రభుత్వ భూములపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..













Click it and Unblock the Notifications