వైసీపీకి చంద్రబాబు వార్నింగ్: దివాళాకోరు పార్టీ, గొడవలు పెట్టుకోవడానికే వస్తారు..
ఇలాంటి ప్రవర్తనతో జనంలో పరపతి పెరుగుతుందని వైసీపీ భావిస్తోందని, కానీ దీనివల్ల వారి పరపతి మరింత దిగజారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పరస్పర దూషణల పర్వం కొనసాగుతోంది. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదని స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. ప్రతిపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
విపక్ష నాయకుల ప్రవర్తన సభలో హుందాగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అన్నా.. స్పీకర్ అన్నా విపక్ష సభ్యులకు గౌరవం లేదన్నారు. ఇంతలో విపక్ష సభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పడంతో.. రన్నింగ్ కామెంటరీ చేస్తే కోపం రాదా? అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ దివాళా కోరు పార్టీగా తయారైందని ఎద్దేవా చేశారు.
ఇలాంటి ప్రవర్తనతో జనంలో పరపతి పెరుగుతుందని వైసీపీ భావిస్తోందని, కానీ దీనివల్ల వారి పరపతి మరింత దిగజారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దేశంలో ఎవరైనా అవినీతిపరులు ఉన్నారంటే.. అది మీరూ.. మీ నాయకుడు తప్ప ఇంకొకరు లేరంటూ వైసీపీని చంద్రబాబు విమర్శించారు. గొడవలు పెట్టుకునేందుకే వైసీపీ నేతలు అసెంబ్లీకి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి మీడియా పాయింట్ లోను గొడవకు దిగారని, అక్కడ కూడా మార్షల్స్ ను పెట్టాలని అన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అవినీతికి తావు లేకుండా అమలు పరుస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. అభివృద్దిలో తాము నంబర్ 1 అయితే, అవినీతిలో వైసీపీ నంబర్ 1 అని ఎద్దేవా చేశారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన పట్ల తాను వార్నింగ్ ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications