Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంగళగిరిలో అభ్యర్థిని మార్చేస్తున్న జగన్...నారా లోకేష్‌పై ఎవరు ఊహించని వ్యక్తి బరిలోకి.. ?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ప్రజాక్షేత్రంలో తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీని ఓడించాలని టీడీపీ, జనసేన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.మరోసారి అధికారం చేపట్టి, ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని ఇటు వైసీపీ కూడా భావిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరి వ్యూహాల్లో వారు పూర్తిగా నిమగ్నమైయ్యారు.

ఒక వచ్చే ఎన్నికల్లో పలువురు నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..2024 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అని ఆరా తీస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేకపోయినప్పటికీ , మాజీ మంత్రి నారా లోకేష్ రాబోవు ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

 mangalagiri constituency

2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసి సత్తా చాటుతానని నారా లోకేష్ సవాల్ చేశారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ తిరిగి పోటీ చేస్తుండగా, ఆయన్ను ఓడించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు బరిలో ఉంటారా అనే అనుమానం నెలకొంది. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందని పార్టీ అధిష్టానం గుర్తించింది. దీనికితోడు..రెడ్డి సామాజికవర్గం ఆళ్ల మీద కొంత అసంతృప్తితో ఉన్నారు.

 mangalagiri constituency

ఇటీవల జరిపిన సర్వేల్లో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనకపడటంతో.. నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నారా లోకేష్ మీద పోటీ చేయించేందుకు జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజీ చిరంజీవితో పాటు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మంగళగిరి నుంచి రేసులో ఉన్నారు.

వీరిద్దరితో పాటు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు కూడా మంగళగిరి సీటును ఆశిస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. మంగళగిరిలో చేనేత వర్గాలు ఎక్కువుగా ఉండే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే.. నారా లోకేష్‌ను ఓడించడం సులభం అవుతుందని వైసీపీ అధినేత లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి చినబాబును గెలిపించేలా వ్యూహాలు పన్నుతున్నాయి. నియోకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధాకు అప్పగించారు.

 mangalagiri constituency

వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా ప్రణాళికలు రచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ విజయం కోసం పార్టీ నాయకులకు గట్టిగానే శ్రమిస్తున్నారు. మంగళగిరి నియోకవర్గం నుంచి టీడీపీ తరుఫున నారా లోకేష్ పోటీ చేయడం ఖాయం కాగ, అధికార పార్టీ నుంచి ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాపట్ల నియోజకవర్గం బరిలో ఉంటారనే టాక్ వైసీపీలో వినిపిస్తుంది. దీనిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+