వైఎస్ జగన్ సర్ప్రైజ్ విజిట్..!!
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో నిర్మించిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన కిడ్నీ, డయాలసిస్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకోసం నిర్మించిన ఆసుపత్రి, అక్కడి నీటి ప్రభావం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు అవి. సుదీర్ఘకాలంగా వెంటాడుతోన్న ఉద్దానం కిడ్నీ సమస్యకు వైఎస్ జగన్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపించింది.

ఉద్దానం ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా 700 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హిరమండలంలో గల రిజర్వాయర్ నుంచి వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని తరలించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. 32 కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైప్లైన్ ద్వారా నీటిని ఈ నీటి శుద్ధి కేంద్రానికి చేర్చుతారు.
అక్కడి నుంచి 132 కిలోమీటర్ల మేర భూగర్భ పైప్లైన్ ద్వారా ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు రక్షిత మంచినీటిని ప్రభుత్వం అందిస్తోంది. ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఈ శుద్ది కేంద్రం నుంచి మంచినీరు సరఫరా అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఏరియల్ సర్వే. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో ఏరియల్ సర్వే చేసిన సీఎం.#MulapetaPort pic.twitter.com/Y7aJaAfA4c
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 14, 2023
దీన్ని ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్.. మూలాపేట పోర్ట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలోని సంత బొమ్మాళి మండలంలో ఈ పోర్ట్ నిర్మితమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జగన్ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
తొలిదశలో 3,600 కోట్ల రూపాయలను ఈ ఓడరేవు నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం. ఫేస్-1 నిర్మాణ పనులను విశ్వ సముద్ర గ్రూప్ చేపట్టింది. సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల కార్గో లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యంతో ఈ పోర్ట్ రూపుదిద్దుకుంటోంది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications