Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ పై జగన్ భారీ పంచులు, అదే ఏడుపు - తెర మీదకు కొత్త నినాదం..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు - పవన్ లక్ష్యంగా మాస్ పంచులు వేసారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ - మ్యారేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణలో తాను పుట్టనందుకు బాధ పడుతున్నానని చెప్పిన వ్యక్తం ఏపీకి నాన్ లోకల్ అని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో పొత్తులు..ఎత్తులు..జిత్తులు..కుయుక్తుల మీద ఆధారడతాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రయోజనం మినహా ఏపీపై పవన్ కు ప్రేమ లేదని జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై వ్యాఖ్యలు: ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు. తన పాదయాత్ర సమయంలో ఉద్దానం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చానని చెప్పుకొచ్చారు.

CM YS Jagan Inaugurates YSR Sujaladhara Project and Kidney Research centre at Uddanam

చంద్రబాబు హయాంలో ఉద్దానం సమస్య ఉన్నా పరిష్కారం చేయాలనే మనసు రాలేదని విమర్శించారు. నాడు రాని పరిష్కారం నేడు ఈ ప్రభుత్వం చూపించిందన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో తాగు నీరు ఇవ్వలేని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. మూడు సార్లు సీఎంగా ..45 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకోవటానికి ఒక్క మంచి పని చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేసారు.

బర్రెలక్కకు వచ్చిన ఓట్లు రాలేదు: తెలంగాణలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ అక్కడ చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో తాను పుట్టనందుకు బాధపడుతున్నానని చెప్పారని..ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ డైలాగ్స్ కొట్టారని వివరించారు. ఏపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కు రాలేదని సీఎం జగన్ ఎద్దేవా చేసారు. డిపాజిట్లు దక్కలేదన్నారు.

CM YS Jagan Inaugurates YSR Sujaladhara Project and Kidney Research centre at Uddanam

చంద్రబాబు ప్రయోజనం మినహా ఏపీ పైన పవన్ కు ప్రేమ లేదన్నారు. పవన్ కు సొంత నియోజకవర్గం కూడా లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టనర్ నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి దత్తపుత్రుడుని పెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో రాజధాని మొదలు ఏం చేసినా ఈ ఇద్దరికీ ఏడుపే ఏడుపు అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

నాన్ లోకల్ స్టార్స్: ఈ ఇద్దరికీ ఏనాడు ఇచ్చిన మాట పైన నిలబడిన చరిత్ర లేదన్నారు. సమాజం గురించి పట్టని ఇలాంటి క్యాన్సర్ గడ్డను ఎన్నికల్లో తొలిగించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో నాలుగు ఆఫీసులో పెట్టినా ఏడుస్తారని..సీఎంగా ఇక్కడ ఉంటానంటే ఏడుస్తారని జగన్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం- పోర్టు వస్తుందన్నా ఏడుస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

నాలుగున్నారేళ్ల కాలంలో పేదల కోసం చేసిన నిర్ణయాలను వివరించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉద్దానం నీటి ప్రాజెక్టు ద్వారా 6.70 లక్షల మందికి సురక్షిత నీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ను మరో రూ 265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోనూ విస్తరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+