ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఏపీలో మరోన్మారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు. అయితే ఈ సారి ముందుగా ముసాయిదా విధానాన్ని తయారు చేసి అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలని , ఆ తర్వాతే ఇసుక విధానాన్ని ప్రజాభిప్రాయం మేరకు ఖరారు చెయ్యాలని ఆయన స్పష్టం చేశారు .

అవినీతికి తావు లేకుండా నూతన ఇసుక విధానం
నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాష్ట్ర మంత్రులు పేర్ని నానీ , కొడాలి నానీ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో , పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు . ఇసుక తవ్వకాల్లోనూ , రవాణాలోనూ అవినీతికి తావు లేకుండా చూడాలని చెప్పారు . ఇసుక ధరలు కూడా రీజనబుల్ గా ఉండాలని సీఎం సూచించారు . నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు .

పారదర్శకంగా ఇసుక రవాణా చెయ్యాలి
పారదర్శకంగా ఇసుక రవాణా ఉండాలని చెప్పారు . ఇసుక సరఫరాలో కూడా ఎఫిషియెన్సీ ఉండాలని చెప్పారు .
చలానా కట్టి ఎవరైనా వచ్చి తీసుకు తీసుకుపోయే విధంగా కొత్త విధానం ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇసుక రీచ్ ల సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు . కొత్త ఇసుక విధానం ఏ విధంగా ఉండాలి ? ఏ రేటుకి అమ్మాలి అన్నది ప్రాంతాలవారీగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇసుకపై సమీక్షలో పలు సూచనలు చేసిన సీఎం జగన్
నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఎస్ఈ బీ రంగప్రవేశం చేస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఇసుక సులభంగా దొరికే విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు బలహీనవర్గాల , ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని, అందుకోసం టోకెన్ విధానాన్ని తీసుకు రావాలని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల వరకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయవచ్చన్న అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు .
Recommended Video

నూతన ఇసుక విధానం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ .. తర్వాతే విధానం ఖరారు
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇసుక విధానం ముసాయిదాను రూపొందించాలని, ఆ రూపొందించిన ముసాయిదా పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ప్రజల అభిప్రాయం మేరకు కొత్త ఇసుక విధానం ఖరారు చేయాలని మంత్రుల బృందానికి సూచించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందించడం కోసం కొత్త అంశాలతో ముసాయిదా రూపొందించాలని సీఎం జగన్ సూచించడం గమనార్హం
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications