కోల్స్కాం కేసు: దాసరి, జిందాల్ ప్రమేయంపై తుది నివేదికకు మరింత గడువు
కోల్ స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు తుది నివేదికను నిర్దుష్ట నమూనాలో సమర్పించేందుకు ప్రత్యేక కోర్టు సీబీఐకి మరికొంత గడువు మంజూరుచేసింది.
నివేదిక తయారీ పూర్తయిందని, దానిని సీనియర్ అధికారులకు పంపించానని, అందుచేత సమయమివ్వాలని ప్రత్యేక కోర్టు జడ్జి భరత పరాశర్ను సీబీఐ దర్యాప్తు అధికారి సోమవారం అభ్యర్థించారు. ఈ మేరకు తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 6న తేదీన తుది నివేదికను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.

కాగా, దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ.. సీబీఐ గతంలోనే నివేదిక ఇచ్చింది. అందులో ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదిక, డాక్యుమెంట్లు, సాక్షుల జాబితాలు కూడా అందులో ఉన్నాయి. అయితే అది నిర్దుష్ట రూపంలో లేదు. తుది నివేదిక సమర్పించకపోవడం వల్ల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు గతంలోనే ఆక్షేపించింది. ఈ క్రమంలోనే సీబీఐకి కోర్టు గడువును మంజూరు చేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications