మెమెన్కు ఉరి: కలాం గౌరవార్థమంటూ ఏపీవాసుల ఉరి కేసు గుర్తుచేశారు!
కోల్కతా: మరణ శిక్షను వ్యతిరేకించే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం... యూకూబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పైన పునరాలోచన చేయాలని మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
మెమెన్కు ఉరిశిక్షను గురువారం ఉదయం అమలు చేశారు. అంతకుముందు బుధవారం గోపాలకృష్ణ గాంధీ మాట్లాడారు. మరణ శిక్ష పైన న్యాయ కమిషన్ సమాలోచన చేయాలన్నారు. ప్రజాప్రయోజన కారణాలతో ఈ అభ్యర్థన చేస్తున్నట్లు చెప్పారు.

1997కు ముందు సంబంధించిన కేసును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విధించిన మరణ శిక్షను మహాశ్వేతా దేవి అభ్యర్థన మేరకు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మార్పులు చేశారని గుర్తు చేశారు.
యాకూబ్ మెమెన్కు మరణ శిక్ష విధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులూ అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. కాగా, 1997లో ఇద్దరి ఏపీ వారికి మరణ శిక్ష విధించగా.. మహాశ్వేతా దేవి, ఇతరులు పలువురు దానిని రద్దు చేయాలని అభ్యర్థించారు. నాటి రాష్ట్రపతి మార్పులు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications