మోసం: మాజీ మంత్రి శైలజానాథ్పై సిపికి ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ చైర్మన్గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్ ప్రైవేట్ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ కంపెనీకి శైలజానాథ్ సమీప బంధువు రమేష్ ఎండీగా ఉన్నారని వారు ఫిర్యాదులో ఆరోపించారు. కంపెనీలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు.

ఆ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కాగా, ఉద్యోగుల ఫిర్యాదుపై శైలజానాథ్ స్పందించారు కంపెనీకి గౌరవ హోదాలో చైర్మన్గా వ్యవహరిస్తున్న మాట వాస్తవమేనని అయితే, ఆ కంపెనీ తనది కాదని తెలిపారు. కంపెనీ ఎండా రమేష్ తన బంధువు కాదని చెప్పారు.
సంస్థలో కొన్ని పరిపాలనాపమైన సమస్యలున్నాయన్నారు. అయినా ఉద్యోగులు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన వారు సైతం ఫీలవుతూ ‘సారీ సార్' అని తనకు మెసేజ్ పెట్టారని వివరించారు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications