శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది: జగన్ పార్టీలోకి 9న ధర్మాన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Parasad Rao
శ్రీకాకుళం: మాజీమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు ఈ నెల 9వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళంలోని వైయస్సార్ కళ్యాణమండపంలో నిర్వహించిన సిక్కోలు తిరుగుబాటు సభ సన్నాహక సమావేశంలో ఆయన ప్రకటించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని చారిత్రాత్మకమైన తప్పిదం చేసిందన్నారు.

9న జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలోకి ఎవరు వచ్చినా వద్దనడానికి వీల్లేదని, తనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరడానికి కృషి చేయాలని కోరారు.

కాంగ్రెస్ అధిష్ఠానం తమను కాదని విభజన నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం అన్యాయమన్నారు. జిల్లాలో వెనుకబడిన పన్నెండు కులాలు ఓసి జాబితాలో ఉండగా, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకొని వారిని బిసి జాబితాలో చేర్పించారని కొనియాడారు.

రైతు రుణాల మాఫీ అంటూ జనాలను మోసపుచ్చే ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం తాపత్రయం పడుతుండగా, ప్రజల, ప్రాంతాల అవసరాలు, అభివృద్ధికి తాపత్రయపడుతున్న జగన్ పార్టీలో చేరడం మంచిదని భావించానన్నారు. కాగా, ధర్మానతో పాటు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే జగన్నాయకులు కూడా జగన్ వైపు వెళ్లనున్నారు.

English summary
Congress senior MLA Dharmana Parasad Rao on Monday said Congress had made a historial mistake by announcing separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X