తుఫాన్ వల్ల భేటీ వాయిదా: డిగ్గీ, ఊరుకున్నారేం: దానం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం పైన ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశం తుఫాను వల్ల వాయిదా పడిందని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
అదే సమయంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. పరేఖ్ ఏమైనా చెప్పాలనుకుంటే సిబిఐ ఎదుట చెప్పాలన్నారు. బొగ్గు గనుల కేటాయింపు విషయంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ విమర్శలు అర్థరహితమన్నారు. ఎన్డీయే అనుసరించిన విధానాలనే యూపిఏ అనుసరించిందన్నారు.

కాగా, బొగ్గు కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాము దోషులమైతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనన్నారు. ప్రధాని పైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఎలా ఊరుకున్నారు?: దానం
తిరుపతి ఉద్యమ ఘటన విషయమై ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో ఆరోపించారు. గతంలో కాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని మూడు నెలలు జైల్లో పెట్టారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమాధి కడితే ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. సుమోటోగా స్వీకరించాలని దానం నాగేందర్ డిజిపికి ఫిర్యాదు చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications