బెజవాడలో కాల్పుల కలకలం: గోదావరిలో సజీవదహనం

cops arrest shooter in bus stand firing
విజయవాడ/రాజమండ్రి: కృష్ణా జిల్లా విజయవాడలో కాల్పుల కలకలం చెలరేగింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం తెల్లవారుజామున మరుగుదొడ్ల వద్ద ఓ వ్యక్తి చేతిలోని తుపాకీ పేలింది. ఈ ఘటనలో వీర వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తి మరుగుదొడ్డిలోకి వెళ్లిన కాసేపటికి అతని చేతిలో ఉన్న తుపాకీ పేలింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటరమణ తొడలోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. అక్కడే పని చేస్తున్న వ్యక్తులు వెంటనే కాల్పులకు కారణమైన ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

కృష్ణ లంక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఒకరు పూజారీ అని తెలుస్తోంది. పోలీసులు ఎనిమిది రౌండ్ల బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అగ్ని ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం దుర్గా థియేటర్ సమీపంలోని ఒక పూరి గుడిసె లో సోమవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒకే కుటుంబానికి వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+