ఏపీలో పోలింగ్ ను మించిన కౌంటింగ్ టెన్షన్..! ఇంటెల్ రిపోర్ట్స్ తో అలర్ట్..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీ స్దాయిలో పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేశారు. ప్రధాన పార్టీలు పోలింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు ఆయా పార్టీలను టెన్షన్ పెడుతోంది. పోలింగ్ సరళి మాకు అనుకూలమంటే మాకు అనుకూలమంటూ పైకి చెప్పుకుంటున్న నేతలకు లోలోపల మాత్రం ఫలితాలపై టెన్షన్ పెరుగుతోంది.
అదే సమయంలో రాష్ట్రంలో పోలింగ్ రోజు పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, వాటిపై ఈసీ తీసుకుంటున్న కఠిన చర్యలు, మరోవైపు నిఘా వర్గాల నివేదికలు నేతల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసపై తీవ్రంగా స్పందించిన ఈసీ పలువురు కీలక అధికారుల్ని సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ వేటు కూడా వేసింది. అంతే కాదు సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ నివేదిక కూడా ఇప్పటికే డీజీపీకి అందింది.

అయితే ఇదంతా ఓ ఎత్తు.. ఇకపై జరిగేది మరో ఎత్తు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం నిఘా వర్గాల నుంచి వస్తున్న హెచ్చరికలే. ముఖ్యంగా కౌంటింగ్ కు ముందు నుంచే రాష్ట్రంలో పలు చోట్ల హింస ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. అందులోనూ పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం వంటి చోట్ల కూడా హింసకు అవకాశం ఉందంటూ అందిన నిఘా అలర్ట్స్ రాష్ట్రంలో పోలీసుల్ని సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో కౌంటింగ్ పై టెన్షన్ మరింత పెరుగుతోంది.
ఇప్పటికే కౌంటింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పార్టీలు... ఎక్కడైనా తేడా వస్తే మాత్రం రెచ్చిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ పార్టీలు ఏ స్దాయిలో అలర్ట్ గా ఉన్నాయో అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఈసారి కసిగా జరిగిన పోలింగ్ రేపు ఏదైనా ఫలితాల్లో తేడా వస్తే హింసకు కూడా కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications