అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొడవపడి నడిరోడ్డుపై దంపతుల ఆత్మహత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

 A couple committ suicide attempt in Anantapur
అనంతపురం/ప్రకాశం: గొడవపడిన ఓ దంపతులు నడిరోడ్డుపైనే ఆత్మహత్యకు యత్నించారు. బ్లేడుతో కోసుకోవడం వీరిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటన అనంతపురం నగరంలోని శ్రీకంఠ కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మనోహర్, సువర్ణ అనే దంపతులు రోడ్డుపై గొడవపడ్డారు. మనోహర్.. సువర్ణను మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె సమీపంలోని దుకాణంలోకి వెళ్లి బ్లేడు కొనుగోలు చేసింది. దాంతో ఆమె మెడపై కోసుకుంది. గమనించిన మనోహర్ తాను కూడా బ్లేడుతో చేయి కోసుకున్నాడు.

తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళపై దాడి: బంగారు గొలుసు అపహరణ

ప్రకాశం: ఒంటరిగా వెళుతున్న మహిళపై దాడి చేసిన దుండగులు, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో జరిగింది. దుండుగల దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

English summary
A couple committed suicide attempt in Anantapur on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X