ఏపీలో పోలీస్ నెట్వర్క్పై సైబర్ ఎటాక్: హ్యాకింగ్తో స్తంభించిన విధులు..
కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
చిత్తూరు: ఏపీ పోలీస్ నెట్వర్క్ హ్యాకింగ్కు గురైంది. హ్యాకర్ల పంజాతో శుక్రవారం మధ్యాహ్నాం నుంచి పోలీస్ నెట్ వర్క్ కంప్యూటర్లు స్తంభించిపోయాయి. చిత్తూరు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
హ్యాకింగ్ పై తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
విండోస్ ఆపరేటింగ్ వాడుతున్న సర్వర్లే ఎక్కువ శాతం హ్యాకింగ్ బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 25శాతం కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవగా.. వాటిని డీకోడింగ్ చేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో పోలీస్ నెట్ వర్క్ వరుసగా పలు చోట్ల హ్యాకింగ్ గురవుతున్నట్లు చెబుతున్నారు.