Cyclone Ditwah: తరుముకొస్తున్న మరో తుఫాన్..! 5 జిల్లాలకు సర్కార్ అలర్ట్ ..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా, అనంతరం దిత్వా తుఫాన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని అనుకుని తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ తుపాన్ ఆంధప్రదేశ్ వైపుకు వస్తోంది. దీంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కాస్తా తీరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
ఏపీలోని తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాజా పరిస్దితిని హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. అనంతరం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. ఎక్కడ పాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచించారు. కాబట్టి ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు. శిథిలావస్థ స్థితిలోని ఇళ్లల్లో ఉండేవారిని గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి సూచించారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే రైతాంగం కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు.
-
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications