ఏపీలో ఈదురుగాలుల భీభత్సం: ఆయిల్ ట్యాంకర్ బోల్తా..
బలంగా వీస్తున్న ఈదురు గాలుల ధాటికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రధానరహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.
విజయవాడ: చెన్నైని వణికిస్తోన్న వార్దా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ మీద కూడా పడింది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. కొన్ని చోట్ల చెట్లు నేలకొరగగా, కొన్ని చోట్ల హోర్డింగులు కూడా కిందపడే ప్రమాదం కనిపిస్తోంది.

బలంగా వీస్తున్న ఈదురు గాలుల ధాటికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రధానరహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి లీకైన చమురు రహదారిపై వృథాగా పోతోంది. ట్యాంకర్ బోల్తా పడటంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో వర్షాలు, ఈదురు గాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. తమిళనాడు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఏపీలో సహాయక చర్యలకు సంబంధించి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications