కిరణ్ కొత్తపార్టీపై గల్లా, ఎన్నికల తర్వాత అని రాయపాటి

Decision on New party after elections in 5 states: Rayapati
హైదరాబాద్/చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ వార్తలు ఊహాగానాలే అని మంత్రి గల్లా అరుణ కుమారి సోమవారం కొట్టి పారేశారు. ఉదయం విలేకరులతో మాట్లాడుతూ సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఆటుపోట్లు సహజమన్నారు. త్వరలో అన్నీ సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించలేనన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత: రాయపాటి

కొంతకాలంగా కొత్త పార్టీ విషయమై మాట్లాడుతున్న గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మరోసారి స్పందించారు. కొత్త పార్టీ విషయమై ఇప్పుడు నిర్ణయం తీసుకోమని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నందున ఆ తర్వాత తీసుకుంటామని చెప్పారు.

కిరణ్ వెంటే: పితాని

రాష్ట్ర సమైక్యతకు కట్టుబడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం మార్చాలని చూస్తే సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెంటే నిలుస్తామని మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకరిద్దరు మంత్రులు అధిష్ఠానం నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించవచ్చని, కానీ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా సమైక్యతకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.

తనకు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం మేరకు కిరణ్‌కు కొత్త పార్టే పెట్టే ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. కిరణ్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్ అవాకులూ చవాకులూ పేలుతున్నారన్నారు. జగన్ ప్రేలాపనలు ఇప్పటి వరకూ సమైక్యం కోసం పోరాడిన వారందరినీ అవమానించేలా ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+