మీరు సూపర్బ్, బెజవాడలో మా ఇంటికి రండి: ఏపీ మంత్రి, టీ కాంగ్రెస్ చీఫ్
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య సోమవారం నాడు ఆసక్తికర సంభాషణ సాగింది. ఏపీ, తెలంగాణ శాసన సభలు జరుగుతున్న విషయం తెలిసిందే.
సోమవారం ఇరు రాష్ట్రాల సభల అనంతరం ఇరువురు నేతలు బయటకు వచ్చారు. ఉత్తమ్, దేవినేనిలు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారిద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి దేవినేనికి ఉత్తమ్ కితాబిచ్చారు.

పక్క పక్కనే ఉన్న నియోజకవర్గాల వాళ్లమని, కాబట్టి కలిసి ఉండాలని ఉత్తమ్ చెప్పారు. దానికి దేవినేని సానుకూలంగా స్పందించారు. ఎప్పుడైనా విజయవాడకు వస్తే తమ ఇంటికి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేవినేని సూచించారు. కాగా, ఈ నెల 7వ తేదీన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications