సస్పెన్స్కు తెర: ధర్మానతో ఎమ్మెల్యేలు జంప్ (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభాపతి నాదెండ్ల మనోహర్కు ఆదివారం రాజీనామా లేఖ పంపారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కాంగ్రెస్లో చేరారు.
ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన సిక్కోల్ తిరుగుబాటు కార్యక్రమంలో ధర్మానకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో లాంఛనంగా ధర్మాన ఆ పార్టీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు అయ్యింది.
ఎంతో కాలంగా ధర్మాన ఆ పార్టీ గూటికి చేరుతారన్న సస్పెన్ష్కు తెరపడింది. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదించిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనియాకు పంపిన లేఖలో ధర్మాన పేర్కొన్నారు.

ధర్మాన
సమైక్యంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్న వాదనను ఢిల్లీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ధర్మాన ఏఐసిసి అధినేత్రికి రాసిన లేఖలో వివరించారు. అంతేకాకుండా సోనియా గాంధీకి కూడా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు లేఖ పంపారు.

ధర్మాన
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్ పాత్ర మరువలేనిదంటూ, దేశ ఆర్థిక, సంక్షేమ సృష్టికి కాంగ్రెస్ నిర్వహించిన పాత్ర గణనీయమైందని ధర్మాన లేఖలో పేర్కొన్నారు.

ధర్మాన
యూపిఏ ప్రభుత్వ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అందించిన సహకారం మరువలేనిదని, కాంగ్రెస్ సభ్యత్వం కలిగి ఉండటమే గౌరవంగా, గొప్పగా భావించామని తెలిపారు. కానీ అధిష్ఠానంలో కొంతమంది పెద్దల స్వార్థపూరిత చర్యలకు ఇప్పుడు ఆంధ్రజాతి బలవుతుందని లేఖలో ధర్మాన స్పష్టం చేశారు.

ధర్మాన
విభజన నిర్ణయాన్ని గతంలో వ్యతిరేకించిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధానానికి, 2000లో సిడబ్ల్యూసి చేసిన తీర్మానం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీ కృష్ణకమిటీ నిర్ణయాలకు విలువలేకుండా అధిష్ఠానం నిర్ణయం సీమాంధ్ర ప్రాంత ప్రజలతోపాటు, పార్టీ నేతలు, కార్యకర్తల మనోభావాలకు తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మాన
ప్రతిపాదించిన విభజన బిల్లు భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని, ప్రజాస్వామిక విలువలకు గొడ్డలిపెట్టుగా ఉందని ధర్మాన పేర్కొన్నారు.

ధర్మాన
ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సిక్కోల్ సభలో ధర్మాన మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

ధర్మాన
30 ఏళ్లు కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని పార్టీ క్రీయాశీలక సభ్యత్వాన్నీ వదులుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయం జగన్ అన్న నమ్మకంతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిలిచిపోయిన అభివృద్ధికి దిక్చూచీ జగన్ పార్టీయే అన్నారు.

ధర్మాన
ధర్మానతోపాటు 282మంది సర్పంచులు, 432మంది సిట్టింగ్, మాజీ కాంగ్రెస్ నేతలు, పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ధర్మాన
మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభాపతి నాదెండ్ల మనోహర్కు ఆదివారం రాజీనామా లేఖ పంపారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కాంగ్రెస్లో చేరారు.

ధర్మాన
ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన సిక్కోల్ తిరుగుబాటు కార్యక్రమంలో ధర్మానకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో లాంఛనంగా ధర్మాన ఆ పార్టీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు అయ్యింది.

ధర్మాన
ఎంతో కాలంగా ధర్మాన ఆ పార్టీ గూటికి చేరుతారన్న సస్పెన్ష్కు తెరపడింది. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదించిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనియాకు పంపిన లేఖలో ధర్మాన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications