అమరావతి వెళ్లి పొమ్మంటే ఏం చేస్తాం ? చంద్రబాబు పథకాలు తీసేస్తాడు-ధర్మాన కామెంట్స్
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబునూ ఆయన టార్గెట్ చేశారు.
శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిగ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోన్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ చంద్రబాబు, అమరావతి రాజధానిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం డబ్బంతా హైదరాబాద్ లో పెట్టాం ..వాళ్లు వెళ్లిపొమ్మన్నారు, రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే వారు వెళ్లిపొమ్మంటే ఏం చేస్తామని ఉత్తరాంధ్ర వాసుల్ని ప్రశ్నించారు. అన్ని రకాలుగా అభివృద్ది చెందిన ప్రాంతం విశాఖ అని, విశాఖని రాజధానిగా చంద్రబాబు వద్దంటున్నారని ధర్మాన ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతిని సృష్టించారని ధర్మాన ఆరోపించారు. విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మోదలు పెట్టారని, ప్రజల తిరుగుబాటు చూసి తోక ముడిచి వెళ్లిపోయారన్నారు. యాత్ర గురించి మాట్లాడటమే మానేసి, అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటున్నారని ధర్మాన విమర్శించారు. అన్యాయాలకి అడ్రస్ టీడీపీ, చంద్రబాబులే ..నువ్వు అన్యాయాల గురించి చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారని, ముందు ఆంద్ర ప్రదేశ్ లో సెటిలై అప్పుడు మాట్లాడు చంద్రబాబూ అని ధర్మాన సూచించారు.

అందరిని కూడగట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నావ్ .. అది సాద్యంకాదని చంద్రబాబు, పవన్, బీజేపీని ఉద్దేశించి ధర్మాన వ్యాఖ్యానించారు. టీడీపీ ఐదేళ్లలో ఓక్క పథకమైనా న్యాయంగా ఇఛ్చారా అని ధర్మాన ప్రశ్నించారు. ఫథకాలపై ఆరోపణలు చేస్తావ్ , మరాలా మేం అధికారంలోకి వస్తే అన్ని కొనసాగిస్తానంటావ్... ఇదేం మాయ మాటలన్నారు. రోడ్లకి కన్నాలు పడితే కారణం మీరేకదా ..మీ ఐదేళ్లలోమంచి రోడ్లు వేస్తే .. ఈ పరిస్తితి ఉండేది కాదుగా అని ధర్మాన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ వస్తే అన్ని పథకాలు తీసేస్తాడన్నారు. రాష్ట్రంలోనే లేని నీకు రాష్ట్రంతో సంబంధం ఏంటి చంద్రబాబూఅని ప్రశ్నించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications