గుంటూరులో ఆగని అతిసార మరణాలు...15 కి చేరిన మృతుల సంఖ్య
గుంటూరు: గుంటూరులో అతిసారం మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. నగర పాలక సంస్థ పరిధిలో కలుషిత నీరు తాగి మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి 15కి చేరింది. గుంటూరు జిజిహెచ్ లో డయేరియాకు చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. కొత్తపేటకు చెందిన గంగాభవానీ, పీవీ తోటకు చెందిన నూకరాజు, బీఎస్ నగర్కు చెందిన బుర్రయ్య ఈ తెల్లవారుజామున మృతిచెందారు.
ఈ ముగ్గురిలో గంగాభవానీ, నూకరాజును తొలుత రమేశ్ ఆసుపత్రి నుంచి బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

జిజిహెచ్ లో ఇప్పటికీ అతిసార సమస్యతో సుమారు 100మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు కాగా...పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అతిసార సమస్యతో కొత్తగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ...మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications