జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నించిందా ? ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్ధులపై ఏ విధంగా అయినా పైచేయి సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేన ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది.

ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తుల్లేకుండా పోటీ చేయలేవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఆధారంగా ఉన్న ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అప్పటి వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసి గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడిందంటూ జనసేన పోస్ట్ చేసింది.
2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది#HelloAP_ByeByeYCP pic.twitter.com/kQK5onGPIU
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2024
2017లో నంద్యాల ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా జనసేనతో పొత్తును పరిశీలించినట్లు ప్రశాంత్ కిషోర్ ఈ వీడియోలో వెల్లడించారు. ఈ మేరకు ప్రయత్నించాలని తనకు వైసీపీ నేతలు, సానుభూతి పరులు తనకు చెప్పినట్లు పీకే తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి వెల్లడిస్తున్నారో మాత్రం ఈ వీడియోలో వెల్లడి కాలేదు.
కానీ వైసీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన విషయాన్ని మాత్రం పీకే గట్టిగానే చెప్పుకొచ్చారు. ఈ వీడియోతో పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications