జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నించిందా ? ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్ధులపై ఏ విధంగా అయినా పైచేయి సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేన ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది.

ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తుల్లేకుండా పోటీ చేయలేవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఆధారంగా ఉన్న ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అప్పటి వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసి గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడిందంటూ జనసేన పోస్ట్ చేసింది.
2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది#HelloAP_ByeByeYCP pic.twitter.com/kQK5onGPIU
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2024
2017లో నంద్యాల ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా జనసేనతో పొత్తును పరిశీలించినట్లు ప్రశాంత్ కిషోర్ ఈ వీడియోలో వెల్లడించారు. ఈ మేరకు ప్రయత్నించాలని తనకు వైసీపీ నేతలు, సానుభూతి పరులు తనకు చెప్పినట్లు పీకే తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి వెల్లడిస్తున్నారో మాత్రం ఈ వీడియోలో వెల్లడి కాలేదు.
కానీ వైసీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన విషయాన్ని మాత్రం పీకే గట్టిగానే చెప్పుకొచ్చారు. ఈ వీడియోతో పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
-
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications